వాళ్లు మంచివాళ్లు అయితే ఆడవాళ్లు వ్యభిచారమే చెయ్యరు.. హాట్ టాపిక్‌గా మారిన యాంకర్ రష్మి పోస్ట్

by Disha Web Desk 7 |
వాళ్లు మంచివాళ్లు అయితే ఆడవాళ్లు వ్యభిచారమే చెయ్యరు.. హాట్ టాపిక్‌గా మారిన యాంకర్ రష్మి పోస్ట్
X

దిశ, సినిమా: బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్ధస్త్ ద్వారా మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వెండితెరపై మాత్రం అంతగా రాణించలేకపోయింది. దీంతో మళ్లీ బుల్లితెరవైపు అడుగులు వేసింది. ప్రస్తుతం పలు షోలు చేస్తూ సందడి చేస్తుంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. సమాజంలో మూగ జీవాలపై జరుతున్న హింసలపై, అలాగే మహళలపై జరుగుతున్న దాడులపై స్పందిస్తు పోస్ట్ పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

‘మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఫుడ్‌ పెట్టాలి. కానీ ‘డిక్‌’ కాదు. అని ప్రముఖ రైటర్‌ రచెల్‌ మోరన్‌ రాసిన కోట్‌ని.. మరో రైటర్‌ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ని రష్మి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్‌ చేసింది. దీంతో పాటు ‘చాలా మంది మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం అనేదే ఉండదు. దాని మనుగడ కూడా ఉండదు’ అంటూ ఓ వేశ్య చెప్పిన డైలాగును సైతం షేర్ చేసింది రష్మి. ప్రస్తుతం ఈ పోస్ట్ దేని గురించి పెట్టిందా అంటూ.. నెట్టింట హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు.

Read More..

ఒక్క ప్లాప్‌తో సినిమాలకు గుడ్ బై.. కట్ చేస్తే బిలీనియర్.. ఈమె ఎవరంటే?

Next Story

Most Viewed