బీఅలర్ట్: అన్నం వండే ముందు బియ్యం నానబెడుతున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే?

by Anjali |
బీఅలర్ట్: అన్నం వండే ముందు బియ్యం నానబెడుతున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే?
X

దిశ, ఫీచర్స్: చాలా మంది మహిళలు అన్నం వండే ముందు బియ్యం నానబెడుతారు. బియ్యం నానబెట్టడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అన్నం తొందరగా ఉడుకుతుంది అని భావిస్తారు. కానీ రైస్ నానబెట్టడం వల్ల నష్టమే తప్ప లాభం లేదంటున్నారు నిపుణులు. రైస్ నీటిలో నానబెట్టడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటామో తాజాగా పోషకాహార నిపుణులు చెప్పిన విషయాలు ఇప్పుడు చూద్దాం..

అన్నం వండే ముందు బియ్యం నానబెట్టడం ద్వారా అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు, పోషకాలు మొత్తం పోతాయి. ఒకవేళ నానబెట్టాలనుకుంటే.. కేవలం పది నిమిషాలు మాత్రమే నానబెడితే చాలని సూచిస్తున్నారు. గంటలు గంటలు రైస్ నానబెడితే పోషకాలు నశిస్తాయని.. దీంతో రైస్ తిన్నా శరీరానికి ఎలాంటి పోషకాలు అందవని చెబుతున్నారు. వాటర్‌లో రైస్ ఎక్కువ సమయం పాటు ఉన్నట్లైతే అందులోని గైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు పెరుగుతాయి. కొద్ది సేపు నానబెడితే బియ్యంలోని ఎంజైమాటిక్ విచ్ఛిన్నం జరుగుతుందని అంటున్నారు. దీంతో మధేమేహం ఉన్నవారికి లాభం చేకూరుతుంది. అలాగే అన్నం మైక్రో ఓవెన్ అండ్ రైస్ కుక్కర్లలో అస్సలు వండొద్దని ఆరోగ్య నిపుణులు చూసిస్తున్నారు.

Advertisement

Next Story