రాక్షసిని పూజించే ప్రత్యేక దేవాలయం.. అక్కడి ప్రత్యేకత ఏమిటో తెలుసా..

by Sumithra |
రాక్షసిని పూజించే ప్రత్యేక దేవాలయం.. అక్కడి ప్రత్యేకత ఏమిటో తెలుసా..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : మన దేశంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. అలాంటి ఒక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఓ ఆలయంలో హిడింబ అనే రాక్షసిని పూజిస్తారు. ఏంటి రాక్షసిని పూజించే ఆలయమా అనుకుంటున్నారు కదా. అది నిజమే. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో హిడింబాదేవికి పూజలు చేయడంతో పాటు, పెద్ద పండుగను, జాత్రలను కూడా ఇక్కడ నిర్వహిస్తారు.

మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, విదర్భ సరిహద్దులో ఉన్న పరాద్ గ్రామంలో హిడింబను పూజిస్తారు. పరాశర ఋషి, హిడింబా దేవి ఇద్దరి పై భక్తితో ఈ గ్రామంలో ప్రత్యేక తీర్థయాత్ర నిర్వహిస్తారు.

మూడు రోజుల తీర్థయాత్ర..

ఈ ఉత్సవాలకు బుల్దానా, జల్నా, ఛత్రపతి శంభాజీనగర్, జల్గావ్ వంటి సమీప జిల్లాల నుండి భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పరవశించిపోతారు.

Advertisement

Next Story