వారం క్రితం మిస్సింగ్.. నేడు ఇలా

by Sumithra |
వారం క్రితం మిస్సింగ్.. నేడు ఇలా
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వారం రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి శవమై కనిపించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ చెరువు ప్రాంతంలో గుర్తు తెలియని శవాన్ని ఆదివారం గొర్రెల కాపరులు గుర్తించారు.

పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడిది అడ్డకల్ గ్రామానికి చెందిన పి.సుందర్ (54)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed