బావిలో పడి మహిళ మృతి..

by Kalyani |
బావిలో పడి మహిళ మృతి..
X

దిశ, మొయినాబాద్: బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. మొయినాబాద్ హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం జీవన్ గూడ ఎంకేపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి కమలమ్మ (50), తన భర్త చనిపోయినప్పటి నుంచి గత ఏడు సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయింది. చాలా ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించినప్పటికీ జబ్బు నయం కాలేదు. ఎర్రగడ్డ హాస్పిటల్ లో నాలుగు సంవత్సరాలు చికిత్స పొందింది.

కాగా అప్పుడప్పుడు ఇంట్లో నుంచి రోజుల తరబడి ఎవరికి చెప్పకుండా వెళ్ళి తర్వాత ఆమెనే తిరిగి వచ్చేది. ఎప్పటిలాగే తిరిగి వస్తుందని అనుకొని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా మంగళవారం మధ్యాహ్నం గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలోని నీళ్ల బావిలో పడి కమలమ్మ చనిపోయిందని ఓ వ్యక్తి ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కమలమ్మ మరణంపై తమకు ఎవరిపై అనుమానం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story

Most Viewed