తెలంగాణలో బోనాల పండుగకు రంగం సిద్ధం

by Shyam |
తెలంగాణలో బోనాల పండుగకు రంగం సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో బోనాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 25 నుంచి బోనాల సందడి మొదకానున్నట్లు సమాచారం. తొలుత ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు సమర్పించించనున్నారు. మరుసటి రోజు అమ్మవారి రంగం, ఊరేగింపు ఉండనుంది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ మహా నగరంలో బోనాల పండుగను జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే, కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో గతంలో మాదిరిగా ఆంక్షల మధ్య బోనాలు జరిపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.హైదరాబాద్ మహానగరంలో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజా, గోల్గొండ బోనాలు ప్రతీయేటా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story