- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
AP News:విజయవాడలో వరద బీభత్సం..వరద బాధితులకు జనసేన నాయకులు సేవలు
దిశ ప్రతినిధి,కడప:ఇటీవల విజయవాడలో వరద వల్ల ముంపుకు గురైన ప్రాంతాల్లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాలైన సింగ్నగర్, అవనిగడ్డ, మోపిదేవి మండలం లోని కొత్తపల్లె హరిజనవాడ ప్రాంతాలలో స్థానిక జనసేన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా కడప జనసేన నేతలు సేవలు అందించారు. ఉమ్మడి కడప జిల్లాల జనసేన నాయకులు సుంకర శ్రీనివాస్ జనసేన నాయకులు జీవి రమణ, మాలే శివ, నాగేంద్ర ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఇటీవల విజయవాడలో వరద తాకిడికి గురై సర్వం కోల్పోయి నిరాశ్రయులైన అటువంటి వారి కొరకు మా నాయకులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. మానవత్వంతో ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. మా వంతు సాయంగా ఇక్కడికి చేరుకొని నిరాశ్రయులైనటువంటి వారికి దాదాపు 1000 మందికి దుప్పట్లు, కంబళ్లు, చీరలు, నైటీలు, పంచలు సహకారంగా అందించామని తెలిపారు.