AP News:తిరుమల లడ్డూ ప్రసాదం పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News:తిరుమల లడ్డూ ప్రసాదం పై  వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం పై చర్చలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు(Chandrababu), వైసీపీ(YCP) ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మధ్య తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదం పై AP PCC చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల ఆలయాన్ని(Tirumala Temple) అపవిత్రం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని వైఎస్ షర్మిల ఫైరయ్యారు. లడ్డూ ప్రసాదం లో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్ఠకు(Prestige) భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ వేయండి. లేదా సీబీఐతో విచారణ జరిపించండి అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఘోర అపచారానికి పాల్పడిన నీచులు ఎవరో తేల్చండి అని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed