- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
వరద బాధితులకు యువ హీరో సాయం.. పవన్ కల్యాణ్ను కలిసి చెక్ అందజేత
దిశ,వెబ్డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక విజయవాడను వరదలు(Vijayawada Floods) ముంచెత్తాయి. ఇళ్లలోకి వరద(Flood) నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు(Donations) అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం జెట్టి మిస్టర్ కళ్యాణ్ సినీ హీరో మురళీకృష్ణ రూ.పది లక్షల విరాళం(Donation) అందించారు.
ఈ యువ హీరో బంగారుపాళ్యం మండలం జంబువారిపల్లె పంచాయతీ మాధవనగర్కు చెందిన చలపతి నాయుడు, భారతి దంపతుల కుమారుడు. రూ.10,00,005 విరాళ చెక్కును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు(Pawan Kalyan) అందజేశారు. బంగారుపాళ్యంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద ‘హండ్రడ్ డ్రీమ్స్’ పేరుతో ప్రతిరోజూ నిరుపేదలకు రూ.1కే మురళీకృష్ణ భోజనం అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా తన సొంత ఖర్చులతో పేదలకు ఒక పూట కడుపునిండా అన్నం పెడుతున్నారు.