వీడిన వీఆర్వో మిస్సింగ్ మిస్టరీ.. అసలు ఏమైందంటే?

by Jakkula Mamatha |
వీడిన వీఆర్వో మిస్సింగ్ మిస్టరీ.. అసలు ఏమైందంటే?
X

దిశ,పల్నాడు: ముప్పాళ్ల మండలం నార్నెపాడు వీఆర్వో మల్లికార్జునరావు అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోటు రాసి వారం రోజులుగా కనిపించకుండా పోయిన అతని ఆచూకీని పోలీసులు చెన్నైలో గుర్తించారు. మిత్రుడికి చేసిన ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఇంటికి రావాలని పోలీసులు, కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు వీఆర్వో మల్లికార్జునరావు మంగళవారం తిరిగొచ్చాడు. అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులకు వివరించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి వీఆర్వోను తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed