- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Telugu Crime News : చందానగర్లో వ్యక్తి దారుణ హత్య
దిశ, శేరిలింగంపల్లి: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు నెల్లూరు జిల్లాకు చెందిన మాల్యాద్రి (37) నగరానికి వలస వచ్చి చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తార నాగర్లో భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటూ సెంట్రింగ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. దసరా సెలవులకు భార్య పిల్లలు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. అతని ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు మాల్యాద్రిని ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు కూడా ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. తాగిన మత్తులో పరస్పర వివాదం జరిగి హత్య జరిగిందా, లేదా ఏమైనా ఇల్లీగల్ ఎఫైర్ అనేది తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ని రప్పించి చుట్టుపక్కల గాలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.