Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

by Shiva |
Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రం (Tamilnadu State)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కారులో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వారు తిరుపూర్ జిల్లా (Tirupur) లిమిట్స్‌లోని మతుకళం (Mathukulam) సమీపంలోకి చేరుకోగానే అతివేగంతో ఎదురుగా వచ్చిన టూరిస్ట్ వ్యాన్‌, కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు కొన్ని అడుగుల దూరంలో ఎగిరిపడగా.. అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. టూరిస్ట్‌ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 20 మంది స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మడతుకులం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed