రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. బుల్లెట్ ట్రైన్ ప్రారంభం?!

by Jakkula Mamatha |   ( Updated:2024-10-09 08:08:37.0  )
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. బుల్లెట్ ట్రైన్ ప్రారంభం?!
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు వరుస గుడ్ న్యూస్‌లు చెబుతుంది. ఇక సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అయితే సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఏపీకి బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కబోతోంది. అమరావతి, విజయవాడ, చెన్నై, బెంగళూరు నగరాలను కలిపేలా బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయనేది సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో చర్చించినట్లు సమాచారం. దీనిపై ఆయన కచ్చితంగా ఆలోచిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. దీంతో అనుకున్నట్లుగా అన్నీ ఒక కొలిక్కి వస్తే 2027లో పనులు ప్రారంభం కానున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed