పండుగ పూట విషాదం.. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

by Jakkula Mamatha |
పండుగ పూట విషాదం.. ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
X

దిశ,చిన్నకోడూరు: తమ్ముడి కుమారుడికి ఈత నేర్పేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పరిధిలోని ఓబులాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. రాజగోపాల్ పేట ఎస్సై ఎండి ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఓబులాపురం గ్రామానికి చెందిన జక్కుల (అలియాస్) కొండ బోయిన ఎల్లయ్య (38 )తన తమ్ముడి కుమారుడు భానుకు ఊరి పక్కనే ఉన్న కొత్త కుంటలో ఈత నేర్పించేందుకు తీసుకువెళ్ళాడు. ఈ క్రమంలో ముందుగా చెరువులోకి దిగిన ఎల్లయ్య ప్రమాదవశాత్తు చెరువులోని నీటిలో మునిగిపోయాడు.

ఈ విషయం గమనించిన తన తమ్ముడి కుమారుడు గ్రామస్థులకు తెలియజేయగా వారు అక్కడికి చేరుకునే లోపే ఎల్లయ్య మృత్యువాత పడ్డాడు. విషయాన్ని గ్రామస్తులు రాజగోపాల్ పేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజగోపాల్ పేట ఎస్సై ఎండి. ఆసిఫ్ తెలిపారు. పండగపూట గ్రామంలో ఎల్లయ్య మరణించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed