రెడ్ బుక్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు

by M.Rajitha |   ( Updated:2024-10-09 10:12:33.0  )
రెడ్ బుక్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ నేతలు రెడ్ బుక్ పేరు చెప్పి భయపెట్టాలని చూస్తున్నారని, రెడ్ బుక్ బదులు మేము మా పార్టీకి ఉపయోగపడే గుడ్ బుక్ మొదలు పెట్టామని వైసీపీ నేత జగన్ అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిటినీ తట్టుకొని నిలబడే కార్యకర్తలకు పూర్తి భరోసా ఇచ్చే బాధ్యత పార్టీ మీద ఉందని, అందుకే మంగళగిరి ఇంచార్జ్ గా వేమారెడ్డిని నియమించామని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నపుడు కరోనా వంటి అనేక సంక్షోభాలను ఎదుర్కొని కూడా, ఏనాడూ ప్రస్తుత ప్రభుత్వం లాగ సాకులు చెప్పలేదని అన్నారు. స్కూళ్ళు, ఆసుపత్రులను ఆధునీకరించి, నాణ్యమైన విద్య, వైద్యాని గడప గడపకు తెచ్చామని వెల్లడించారు. రెడ్ బుక్ అనేది పెద్ద విషయం కాదని, తమ పార్టీ వాళ్ళు కూడా రెడ్ బుక్ పెట్టి అన్యాయం చేసిన వాళ్ళ పేర్లు రాస్తున్నారని, కానీ మా పార్టీకి మంచి జరిగే పనులను మాత్రమే రాయమని, గుడ్ బుక్ పెట్టమని సూచించానని జగన్ తెలియ జేశారు.

Advertisement

Next Story