వీడు మనిషా? రాక్షసుడా.. తల్లిదండ్రులతో కలిసి భార్యని దారుణంగా హింసించిన కిరాతకుడు.. చివరకు ఏమైందంటే!

by Anjali |
వీడు మనిషా? రాక్షసుడా..  తల్లిదండ్రులతో కలిసి భార్యని దారుణంగా హింసించిన కిరాతకుడు.. చివరకు ఏమైందంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యకు పురుగుల మందు తాగించి.. చిత్రహింసలకు గురిచేసిన ఘటన విశాఖలోని గాజువాకలో చోటుచేసుకుంది. భార్యాభర్తలు పద్మిని, సోమేశ్వరరావు.. తొలుత బాగానే ఉన్నప్పటికీ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. అత్తామమలు వీరికి తోడయ్యారు. అదనపు కట్నం తీసుకురాలేనని చెప్పడంతో కోడలు పద్మినిని చంపేయాలనుకున్నారు. దీంతో ఆమెను ఇంట్లో బంధించి పద్మిని మామ నోట్లో పురుగుల మందు పోశాడు. ఆమె భర్త ఆ మందు కక్కకుండా నోటికీ చేతిని అడ్డుపెట్టుపెట్టాడు. బలవంతంగా పురుగులు మందు తాగించారు. దీంతో ఆమెకు వాంతులయ్యాయి. ఇరుగు పొరుగు చూసి ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఏం తెలియనట్లుగా కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పద్మిని.. ‘‘నా భర్త, అత్త, మామలు.. నా పిల్లలను బ్రతకనివ్వరని, తన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించి న్యాయం చెయ్యండి’’ అంటూ ఆడియో రికార్డ్ లో ఆవేదన వ్యక్తం చేసింది. జరిగినదంతా ఆడియో రికార్డు చేసి మేనమామకు, బంధువులకు పంపింది. చివరకు పద్మిని చికిత్స పొందుతూ చనిపోయింది. ఆడియో రికార్డు విన్న బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త సోమేశ్వరరావు, బాధితురాలి అత్తామామల్ని గాజువాక పోలీసులు అరెస్టు చేశారు.

Next Story

Most Viewed