Tirumala Update: భారీ వర్షాల ఎఫెక్ట్.. పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ

by Shiva |   ( Updated:2024-09-03 15:26:32.0  )
Tirumala Update: భారీ వర్షాల ఎఫెక్ట్.. పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల నేపథ్యంలో తిరుమ‌ల‌ ఆలయానికి భ‌క్తుల ర‌ద్దీ భారీగా త‌గ్గింది. వరదల కారణంగా పలు రైళ్లు రద్దు అవ్వడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి భ‌క్తుల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. 6 గంట‌ల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం అవుతోంది. మంగళవారం ఉచిత సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక‌ రూ.300లతో ప్రత్యేక టోకెన్ తీసుకున్న భక్తులకు రెండు గంట‌ల‌ సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని 63,936 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.4.55 కోట్లు వ‌చ్చినట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story