పరవాడ ఫార్మాసిటీ పరిశ్రమ ప్రమాదంలో ముగ్గురు మృతి

by Mahesh |
పరవాడ ఫార్మాసిటీ పరిశ్రమ ప్రమాదంలో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో తీవ్రంగా గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తీవ్ర గాయాలైన వారు ఒక్కొక్కరిగా మృత్యువాత పడుతున్నారు. ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి మృతి చెందారు. శ్రీకాకుళం వాసి కోరాడ సూర్యనారాయణ ఈరోజు ఉదయం మృతి చెందగా, నిన్న రాత్రి జార్ఖండ్ కు చెందిన లాల్ సింగ్ మృతి.. 24న రొయ్య అంగీర మృతి చెందారు. కాగా చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed