YSRCP:వైసీపీకి బిగ్ షాక్..పార్టీ మారిన కార్పొరేటర్లు

by Jakkula Mamatha |
YSRCP:వైసీపీకి బిగ్ షాక్..పార్టీ మారిన కార్పొరేటర్లు
X

దిశ,వెబ్‌డెస్క్: మహా విశాఖ నగరపాలక సంస్థను చేజిక్కించుకోవడానికి అధికార ఎన్డీయే కూటమి వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే వైసీపీకి చెందిన 20 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరనున్నారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లతో మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సమావేశమై కూటమిలోకి వెళ్లొద్దని అభ్యర్థించారు. పార్టీలో తమకు విలువ లేదని కొంతమంది కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ నుంచి 14 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరారు. వీరిని టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో ఏడుగురు, జనసేనలో నలుగురు చేరారు. వైసీపీ నుంచి కార్పొరేటర్లు బయటకు రావడంతో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది అనే టాక్ వినిపిస్తోంది.




Next Story