తిరుపతిలో ఉద్రిక్తత..రాళ్లతో కొట్టుకున్న ఆ రెండు పార్టీల కార్యకర్తలు!

by Disha Web Desk 18 |
తిరుపతిలో ఉద్రిక్తత..రాళ్లతో కొట్టుకున్న ఆ రెండు పార్టీల కార్యకర్తలు!
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుపతిలో ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల వేళ అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అంతేకాదు ఆ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు విసురుకున్నారు. వివరాల్లోకి వెళితే..చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు కంకర రాళ్లు విసురుకున్నారు. పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.



Next Story

Most Viewed