కష్టకాలంలో అండగా ఉన్నవారికి హృదయ పూర్వక ధన్యవాదాలు : Pawan Kalyan

by M.Rajitha |
Pawan Kalyan to start statewide tour from tirupati on october 5
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు నీట మునిగి పోయాయి. వరద బాధితులను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఈ మేరకు డిప్యూటీ సీఎంవో ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు చేశారు. ఏపీలోని వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందజేసిన నటులు బాలకృష్ణ, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సిద్ధూ జొన్నల గడ్డ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్న మీ ప్రేమకు సదా రుణపడి ఉంటానని అన్నారు.

Next Story

Most Viewed