ఈ చెత్త సీఎం మూడు రాజధానులు కడతారంటా: చంద్రబాబు ఫైర్

by Disha Web Desk 16 |
ఈ చెత్త సీఎం మూడు రాజధానులు కడతారంటా: చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినపై మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు పంచ్‌లు వేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ చెత్త సీఎం మూడు రాజధానులు కడతారంటా అంటూ సెటైర్లు వేశారు. ఇంత చెత్త సీఎంను తాను ఎప్పుడూ చూడలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో తొమ్మిది సార్లు కరెంట్ బిల్లులు పెరిగాయని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో మహిళల మంగళసూత్రాల తెంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందారెడ్డిని చంపింది ఎవరు అని చంద్రబాబు ప్రశ్నించారు. హంతుకుడు పక్కనే ఉన్నా.. దేవుడికే తెలియాలని అంటున్నారని ఫైర్ అయ్యారు. తల్లి, చెల్లి ఎందుకు దూరమయ్యారో చెప్పాలన్నారు. కుటంబ గొడవలను వాళ్లకు వాళ్లే తెల్చుకోవాలని.. కానీ టీడీపీ వాళ్లపైకి నెట్టడమేంటని ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగర్లకు సీఎం జగన్ సీట్లు ఇచ్చారని ఆరోపించారు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రాజంపేట ద్రోహులు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed