ఆర్టీసీ బస్సులో గుండెపోటు.. ప్రయాణకుడు మృతి

by Disha Web Desk 16 |
ఆర్టీసీ బస్సులో గుండెపోటు.. ప్రయాణకుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. మార్గంమధ్యలో ప్రయాణికుడు సొమ్మసిల్లి పడిపోయారు. తోటి ప్రయాణికులు వెంటనే వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే ప్రయాణికుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు కావలికి చెందిన రాజశేఖర్‌రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటన కడప జిల్లా వేంపల్లి పరిధిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. రాజశేఖర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed