తిరుమలలో మరో 8 ప్రాథమిక చికిత్స కేంద్రాలు

by M.Rajitha |
తిరుమలలో మరో 8 ప్రాథమిక చికిత్స కేంద్రాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో జరగనున్న బ్రహ్మోత్సవాల కోసం మరో 8 ప్రాథమిక చికిత్స కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. రానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు లక్షల్లో హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తిరుమలలో 6 ప్రాథమిక చికిత్స కేంద్రాలు, 6 డిస్పెన్సరీలు ఉండగా.. అదనంగా మరో 8 ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వీటిని నారాయణగిరి పార్కులో రెండు, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం, శిలా తోరణం, రాంబగీచ గెస్ట్ హౌస్, 7వ మైలు, పాపనాశనం, బాట గంగమ్మ ఆలయం వద్ద ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. కాగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్నాయి.

Next Story

Most Viewed