ఒకే రంగుతో ఉన్న బోట్లు ఎలా వచ్చాయి.. మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
ఒకే రంగుతో ఉన్న బోట్లు ఎలా వచ్చాయి.. మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం బ్యారేజ్‌ను బోట్లు ఢీకొనడంపై అనుమానం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజ్‌ను బోటుతో డ్యామేజ్ చేయాలని చూశారని ఆరోపించారు. ఒకే రంగుతో ఉన్న బోట్లు ఎలా వచ్చాయి? అని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. కుట్ర వెనుక ఎవరున్నా వదిలిపెట్టం సీరియస్ కామెంట్స్ చేశారు. అంతేకాదు.. చంద్రబాబుపైనా మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబానికి దూరంగా పండుగరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధిత ప్రజలతో ఉన్నారంటే అంతకంటే ఏముంటుందని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు వచ్చే దాకా చంద్రబాబు ప్రభుత్వం ప్రజల వెంటే ఉంటుందని స్పష్టం చేశారు. తమ తప్పు వల్ల జరిగిన ప్రమాదానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి జగన్ బురద రాజకీయం చేస్తుండడం దారుణమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed