Breaking: వైసీపీలో చేరనున్న ముద్రగడ.. క్లారిటీ ఇదిగో..!

by srinivas |
Breaking: వైసీపీలో చేరనున్న ముద్రగడ.. క్లారిటీ ఇదిగో..!
X

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్‌‌లో పార్టీ చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన స్పష్టత ఇచ్చారు. మంచి రోజు చూసుకుని వైసీపీలో చేరతానని ముద్రగడ స్ఫష్టం చేశారు. త్వరలోనే అధికారిక తేదీని ప్రకటిస్తానని తెలిపారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాలకు ముద్రగడ గురువారం చెక్ పెట్టారు. ముద్రగడ పద్మనాభం కొద్ది రోజులు టీడీపీలో చేరతారని, మరికొన్ని రోజులు జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆయా పార్టీల నేతలతో ఆయన సంప్రదింపులు సైతం జరిగాయి. అయితే టీడీపీ, జనసేన నుంచి సానుకూల హామీ రాకపోవడంతో ముద్రగడ పద్మనాభానికి వైసీపీ గాలం వేసింది. ఎంపీ మిధున్ రెడ్డి ద్వారా సంప్రదింపులు జరిపింది. పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ముద్రగడ పద్మనాభం నిర్ణయించుకున్నారు. త్వరలో వైసీపీలో చేరబోతున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు.

Read More..

Breaking: 45 ఏళ్లు దాటిన మహిళల అకౌంట్లలోకి భారీగా డబ్బులు

Advertisement

Next Story

Most Viewed