‘ఇలాంటి డర్టీ కల్చర్‌ను ప్రోత్సహించొద్దు’.. మాజీ మంత్రి బొత్స ఫైర్

by Satheesh |   ( Updated:2024-07-27 12:46:43.0  )
‘ఇలాంటి డర్టీ కల్చర్‌ను ప్రోత్సహించొద్దు’.. మాజీ మంత్రి బొత్స ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో లా అండ్ అర్డర్ అదుపు తప్పిందని.. రాష్ట్రంలో రోజుకో విధ్వంసం జరుగుతోందని అన్నారు. ఆర్మీ మాజీ ఉద్యోగి ఇంటిని కూల్చివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి చెడు సంస్కృతిని ప్రోత్సహించొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతీకార దాడులు, రాజకీయాలు మంచివి కావని హితవు పలికారు. కాగా, ఇటీవల పల్నాడు జిల్లాలోని వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు నిరసనగా వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed