Nara Chandrababu Naidu: దేవరపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

by srinivas |
Nara Chandrababu Naidu: దేవరపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేవరపల్లి మండలం, చిలకావారిపాకలులో జీడిపిక్కల లోడ్‍తో లారీ బోల్తా కొట్టిన ఘటనలో ఏడుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన అందించాలని అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed