సొంత బాబాయ్‌ని చంపేశాడు.. జగన్ ఆర్థిక ఉగ్రవాది: CM రమేష్ సెన్సేషనల్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2024-07-25 15:14:00.0  )
సొంత బాబాయ్‌ని చంపేశాడు.. జగన్ ఆర్థిక ఉగ్రవాది: CM రమేష్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ‌లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. సొంత బాబాయ్‌ని చంపాడు.. జగన్ ఆర్థిక ఉగ్రవాది అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏపీలో జగన్ అరాచక పాలన చేసి ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న సమయంలో జగన్‌కు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి అధికారులపై సీబీఐ, ఈడీ, విజిలెన్స్ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి సంపాదనంతా తిరిగి తెచ్చి ఏపీ అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. ప్రధాని మోడీ, చంద్రబాబుకు పేరు వస్తుందనే అమరావతిని జగన్ సర్వనాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed