Tirumala:శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

by Jakkula Mamatha |
Tirumala:శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
X

దిశ,తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం శుక్రవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగమ శాస్త్రం అనుసారం శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. అలాగే ఇందుకు నిదర్శనం రూ.2245 కోట్ల రూపాయలతో అమరావతికి రైల్వే లైన్ చేసేందుకు కేంద్రం కేంద్ర కేబినెట్ అనుమతి పొందింది. అమరావతికి రూ.1500 కోట్లు, పోలవరంకు రూ.1220 కోట్లు మంజూరు చేయించుకున్నామన్నారు. అన్ని సమస్యల పరిష్కారం దిశగా.. కేంద్రం సహకారం అందిస్తోంది. విజయవాడలో డ్రోన్ సమ్మిట్ చాలా అద్భుతంగా నిర్వహించాం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి వల్ల రాష్ట్రంలోని యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలి ఇదే మా ప్రథమ అజెండా అని అన్నారు.

Advertisement

Next Story