- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Chittoor: చిరుత మృతి కేసులో పురోగతి
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో చిరుత మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అటవీ శాఖ అధికారులు పురోగతి సాధించారు. చిరుతపులి గోర్లు, కాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. బంగారుపాళ్యం మండలం వెతలచేనులోని ఓ ఇంటిలో డీఎఫ్వో భరణి తనిఖీలు నిర్వహించారు. దీంతో చిరుతను చంపిన ఐదు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మీడియాకు వివరాలు తెలిపారు.
వెతలచేను అటవీ ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన వేటగాళ్లు వన్య ప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చారని డీఎఫ్వో భరణి తెలిపారు. రాత్రి సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో చిరుత మృతి చెందనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. నిందితులను విచారిస్తున్నామని తెలిపారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement
Next Story