శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు..

by Jakkula Mamatha |
శ్రీవారి సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు..
X

దిశ, తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం పలువురు రాజకీయ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో జాతీయ సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేశన్, తెలంగాణ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ,సినీ నిర్మాత చెర్రీ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed