Gold Man:తిరుమలలో గోల్డ్ మ్యాన్ ప్రత్యక్షం..ఒంటిపై కిలోల కొద్ది బంగారం

by Jakkula Mamatha |   ( Updated:2024-08-23 09:18:20.0  )
Gold Man:తిరుమలలో గోల్డ్ మ్యాన్ ప్రత్యక్షం..ఒంటిపై కిలోల కొద్ది బంగారం
X

దిశ, డైనమిక్​బ్యూరో: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సామాన్యుడి దగ్గర నుంచి వీవీఐపీల వరకూ ఆ వెంకన్న దయ కోసం క్యూ కడుతూ ఉంటారు. ఇలా స్వామివారి దర్శనం కోసం వచ్చే హీరో, హీరోయిన్లు, వీఐపీలను మిగతా భక్తులు ఆసక్తిగా గమనించడం చూస్తూనే ఉన్నాం. వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడుతుంటారు. ఈక్రమంలో ఓ కుటుంబాన్ని చూసి భక్తుల ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే..పాతిక కేజీల బంగారాన్ని ధరించి పూణేకు చెందిన ఓ కుటుంబం నేడు(శుక్రవారం) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. గోల్డ్ ధరించిన వారిలో సన్నీ నన వాగ్చోరీ , సంజయ్ దత్త త్రయ గుజర్ , ప్రీతి సోని శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే వీరి మెడ నిండా బంగారం ఉండడం భక్తులు ఆశ్చర్యంగా చూశారు. వారి మెడలో దాదాపు పాతిక కేజీల గోల్డ్ ఉంది. వారితో సెల్ఫీలు దిగేందుకు కొంతమంది ఆసక్తి చూపారు. వారు ప్రయాణించే కారు కూడా గోల్డ్ కలర్​లో ఉండడం విశేషం.

Advertisement

Next Story