తిరుచానూరులో దారుణం.. కాలేజీ ఏవోపై క‌త్తితో దాడి

by srinivas |
తిరుచానూరులో దారుణం.. కాలేజీ ఏవోపై క‌త్తితో దాడి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుచానూరు(Tiruchanur)లోని ఓ ప్రైవేటు కాలేజీలో దారుణం జరిగింది. కాలేజీ ఏవో వెంక‌ట‌ర‌మ‌ణ‌పై విద్యార్థి దాడి చేశారు. ప్రిన్సిపల్, ఏవో కూర్చుని మాట్లాడుతుండగా వెనక నుంచి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో వెంక‌ట‌ర‌మ‌ణ‌ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో ఆయన్ను రుయా ఆస్పత్రి(Ruya Hospital)కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రిన్సిపల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏవోకు, విద్యార్థికి మధ్య గొడవలు జరిగాయా అని ఆరా తీశారు. ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story