Breaking:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

by Jakkula Mamatha |
Breaking:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రవ్యాప్తంగా జులై 28వ తేదీన నిర్వహించే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సిలబస్‌లో మార్పులు చేయడం, ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ పరీక్షకు మరికొంత సమయం పెంచాలంటూ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజా ప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు. ఈ విన్నపాలపై APPSC తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల(జులై) 28వ తేదీన జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.





Next Story