కేంద్రమంత్రి కుమరస్వామితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

by M.Rajitha |   ( Updated:2024-10-08 10:19:37.0  )
కేంద్రమంత్రి కుమరస్వామితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీ(Delhi) వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Nayudu) పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి(KumaraSwamy)తో భేటీ అయ్యారు. ముందుగా కుమారస్వామి నివాసానికి వెళ్ళిన బాబును.. ఆయన సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) ను సెయిల్(SAIL) లో విలీనం చేయడంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ ఉక్కు పరిశ్రమను గట్టెక్కించడానికి సీఎం ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులతో మంతనాలు జరుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed