ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ

by Y. Venkata Narasimha Reddy |
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తన పర్యటన షెడ్యూల్ లో భాగంగా చంద్రబాబు నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. సాయంత్రం 4.30కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమవుతారు. 5:45 గం.కు కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 8 గం.కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశమవుతారు. రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమవుతారు.

వరద సాయం, రాజధాని అమరావతి అవుటర్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, రాష్ట్రంలో పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు, బడ్జెట్లో ప్రకటించిన పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి గురించి చర్చిం చనున్నారు.

Advertisement

Next Story

Most Viewed