కడప జిల్లాలో మరో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

by srinivas |
కడప జిల్లాలో మరో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వల చెరువు ఘాట్ సమీపం చింతకొమ్మదిన్నె పరిధిలో కారును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు చక్రాయపేట మండలం కొన్నేపల్లి చెందిన వారిగా గుర్తించారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై జామ్ అయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇదే జిల్లా దువ్వూరు మండలం చింతగుంటలో కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed