- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
బాలాపూర్లో వింత దొంగలు..బిర్యానీ వేడి చేసుకుని తిన్న దుండగులు
దిశ, బడంగ్ పేట్ : ఇంటి తాళాలు పగల కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నగదు, బంగారం, వెండి నగలతో ఉడాయించిన సంఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. అంతేగాకుండా దొంగిలించిన సొత్తు మూటకట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రిజ్ లో ఉన్న భిర్యానిని సైతం వేడి చేసుకుని తిని కూల్డ్రింక్స్ను కూడా తాగిన తీరు చూస్తుంటే దాదాపు దొంగతనం చేసిన ఇంట్లోనే 2 నుంచి 3గంటల వరకు దర్జాగా గడిపినా ఎవరూ పట్టించుకోక పోవడం విశేషం.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
నబీల్ కాలనీలో ఓ నర్సు కుటుంబం నివసిస్తుంది. ఈ నెల 26వ తేదీన మహిళ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లింది. మరునాడు మధ్యాహ్నం వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు, బెడ్ రూమ్ గదితో పాటు ఇతర గదుల తలుపులు ధ్వంసమై ఉన్నాయి. ఇంట్లోని గృహోపకరణ వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తాళాలు పగులగొట్టి ఉండడంతో పాటు బీరువాలోని బంగారు ఆభరణాలతో పాటు వెండి, నగదు చోరీకి గురయ్యింది. అంతేగాకుండా ఫ్రిజ్లో పెట్టిన బిర్యాని గిన్నె మరో గదిలో కనిపించింది. విచిత్రమేంటంటే అందులో బిర్యాని కూడా మాయమయ్యింది. ఆందోళనకు గురైన ఇంటి యజమానురాలు బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
సదరు మహిళ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన అనంతరం ఫ్రిజ్లో ఉన్న భిర్యానిని స్టౌవ్ మీద వేడి చేసుకుని దర్జాగా తిని ... కూల్ డ్రింక్లు సైతం తాగడాన్ని చూస్తుంటే దొంగతనం జరిగిన ఇంట్లోనే దాదాపు 2 నుంచి మూడు గంటల పాటు గడిపిన ఎవరూ పట్టించుకోక పోవడం గమనార్హం. అంతేగాకుండా ఈ విషయమై బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ ఇంటి వైపు రోడ్డు సరిగ్గా లేని కారణంగా నైట్ పెట్రోలింగ్ చేయలేకపోయామని బాలాపూర్ పోలీసులు తెలిపినట్లుగా సదరు మహిళ పేర్కొనడం గమనార్హం. బాలాపూర్ పోలీసులు మాత్రం ఈ చోరీ విషయం తమకు తెలియదంటే తమకు తెలియదని మీడియాకు చెప్పారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.