టీమిండియా దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది: CM రేవంత్ రెడ్డి

by Anjali |
టీమిండియా దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది: CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో నిన్న భారత్ ఘనవిజయం సాధించింది. ఉత్కంఠభరితమైన ఫైనల్లో భారత్ గెలుపొందడంతో క్రికెట్ లవర్స్ సంబరానికి హద్దులే లేకుండా పోయాయి. టాపాకాయలు పేలుస్తూ మరోసారి దీపావళి పండగ జరుపుకున్నారు. టీమ్ ఇండియా రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్ సాధించింది.17 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత టీ 20 ప్రపంచకప్ గెలిచింది. టీ 20 ప్రపంచకప్‌లో మ్యాన్ ఆప్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ నిలిచారు. టీ 20 ప్రపంచకప్ మ్యాన్ ఆఫ్ టోర్నీ గా బుమ్రా నిలిచారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీ 20 వరల్డ్ కప్ విజయంపై అభినందనలు తెలియజేశారు. టీమిండియా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిందని భారత జట్టుపై ప్రశంసల జల్లు కురిపించారు. క్రికెట్ ప్రపంచంలో భారత్ కు ఎదురులేదని నిరూపించారని రేవంత్ రెడ్డి టీమిండియాను కొనియాడారు.

భారత్: భారత్- 176/7

దక్షిణాఫ్రికా: 169/8 స్కోర్ చేసింది.

భారత్ బ్యాటింగ్: కోహ్లీ-76, అక్షర్ పటేల్ 47, శివం దూబే 27 బ్యాటింగ్ చేశారు.

భారత్ బౌలింగ్: హార్దిక్ కు 3 అర్ష్ దీప్, బుమ్రాకు చెరో 2 అక్షయ్ కు ఒక వికెట్

Next Story

Most Viewed