BREAKING: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై పిడుగు పాటు.. ప్రభుత్వానికి రూ.30 కోట్ల నష్టం

by Shiva Kumar |
BREAKING: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై పిడుగు పాటు.. ప్రభుత్వానికి రూ.30 కోట్ల నష్టం
X

దిశ, వెబ్‌‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం భద్రాద్రి పవర్ ప్లాంట్‌ ఆవరణలో పిడుగు పడింది. ఈ ప్రమాదంలో పిగుడు సరిగ్గా జనరేటింగ్ ట్రాన్స్‌ఫార్మర్‌ పడటంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గమనించిన అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటనలో రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అయితే, యూనిట్-1 పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఉన్నాయంటూ అపవాదును ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తాజాగా దుర్ఘటన కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది.

Next Story

Most Viewed