షాకింగ్ సీక్రెట్ రివీల్..సుధీర్‌‌కు తనకు మధ్య ఏం జరిగిందో చెప్పి షోలోనే రచ్చ చేసిన యాంకర్!

by Jakkula Samataha |
షాకింగ్ సీక్రెట్ రివీల్..సుధీర్‌‌కు తనకు మధ్య ఏం జరిగిందో చెప్పి షోలోనే రచ్చ చేసిన యాంకర్!
X

దిశ, సినిమా : సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ కామెడీ షోతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈయన తన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఇక సుధీర్‌కు వరసగా ఆఫర్స్ రావడంతో స్టార్ హీరోల సినిమాల్లో నటించడమే కాకుండా, పలు సినిమాల్లో హీరోగా కూడా చేసి అలరించాడు. ప్రస్తుతం ఆయనకు సినిమా ఆఫర్స్ తగ్గడంతో మళ్లీ బుల్లితెరపైకి అడుగు పెట్టి ఫ్యామిలీ స్టార్ షో‌తో అందరి నోట నవ్వులు పూయిస్తున్నాడు.

ఈ షోలో ఇద్దరు లేడీ యాంకర్లతో కలిసి సుధీర్ చేసే రచ్చ మాములుగా ఉండటం లేదు. స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ షో పేరు మారుమోగిపోతుంది. అయితే తాజాగా, ఈ షోలో ఓ లేడి యాంకర్ సుధీర్‌కు సంబంధించిన ఓ రహస్యాన్ని బట్టబయలు చేసింది. ఆమె సుధీర్‌తో మాట్లాడుతూ.. బావ మన మధ్య అంతా అయిపోయింది కదా అని ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. ఆ మాటతో సుధీర్‌‌తో పాటు లేడీ యాంకర్స్ కూడా నోరెళ్లబెట్టారు. అసలేం జరిగింది అనుకుంటున్నారా?

ఫ్యామిలీ స్టార్ షోలో భాను, స్రవంతి, సుధీర్ యాంకర్‌గా చేస్తూ షోను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సుధీర్‌కు మరదళ్లుగా భాను, యాంకర్ స్రవంతి వ్యవహరిస్తున్నారు. అయితే లేటేస్టు ప్రోమోలో భాను, సుధీర్‌ను నువ్వు నన్ను వదిలేసా విధంగా ఉన్నావు. ఆగు మా ఫ్యామిలీని పిలిపించి తాంబూలం పెట్టిస్తా అంటుంది. అప్పుడు యాంకర్ స్రవంతి బావ.. మనకు అన్నీ అయిపోయాయి కదా అని ఒక్కసారిగా షాకిచ్చింది. దీంతో అక్కడ ఉన్నవారు అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో అందర్నీ తెగ ఆకట్టుకోవడమే కాకుండా, అందరి నోట నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ షోలో శతమానంభవతి, కలిసుందాంరా సీరియల్ నటులు పాల్గొని సందడి చేశారు.

Next Story

Most Viewed