- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
BREAKING: ప్రధాని మోడీతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపైనే కీలక చర్చ
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మొదటిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో ఏపీ సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా వైసీపీ హయాంలో గాడితప్పిన ఆర్థిక పరిస్థితులను ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లినట్లుగా సమాచారం. అదేవిధంగా పోలంవరం నిర్మాణ పనులు, పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులపై చర్చించారని తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్రం పెద్దన్న వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ప్రధాని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఇక పోరుగు రాష్ట్రం తెలంగాణతో ఉన్న విభజన హామీల అమలు ఇద్దరి మధ్య చర్చకు జరిగిందని సీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రధానిని కోరారని టాక్. అనంతరం ఆయన కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, నితిన్ గడ్కరీ సమావేశం అయ్యారు.