వీడిన మహిళ మర్డర్ మిస్టరీ…

by Kalyani |
వీడిన మహిళ మర్డర్ మిస్టరీ…
X

దిశ,కొత్తూరు : గత గురువారం అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. శంషాబాద్ ఏసీపి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మృతిరాలి భర్త ఊరికి వెళ్లడంతో అతని స్నేహితుడు ఇంటికి వచ్చి అత్యాచారయత్నం చేసి ఈ విషయాన్ని బయటకు చెపుతుందేమో అని గొంతు నులిమి హత్య చేసినట్లు తమ విచారణలో తేలినట్లు ఏసీపీ తెలిపారు. కొత్తూరు మండలం ఇనుములనర్వ గ్రామానికి చెందిన యాదమ్మ (45) కొత్తూరులో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కూలీ పని చేస్తూ జీవిస్తున్నారు.ఈ నేపథ్యంలో యాదమ్మ భర్త రామారావు అతని స్నేహితుడు బాబురావు(60)అడ్డాకులీలుగా పని చేసేవారు. రామారావు ఇటీవలే తన స్వగ్రామానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాబూరావు, యాదమ్మకు మద్యం తాగించి అత్యాచార యత్నం చేశాడు.

ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ విషయం బయటకు తెలుస్తుందనే భయంతో యాదమ్మను గొంతు నులిమి చంపేశాడు.యాదమ్మ కుమార్తె రేణుక అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొత్తూరు సీఐ నరసింహారావు హత్య కేసు నమోదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. సోమవారం అనుమానస్పదంగా తిరుగుతున్న బాబురావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో హత్య తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య మిస్టరీని నాలుగు రోజుల్లో ఛేదించడంతో శంషాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు,సీఐ నరసింహారావును,ఎస్సై జి, శ్రీనివాస్, కానిస్టేబుల్ రవీందర్, కుమార్, మహిపాల్ లను అభినందిస్తూ రివార్డుకు అందజేస్తామని తెలిపారు. హత్యకు పాల్పడిన బాబురావును పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed