కమలాపురంలో యువకుడి దారుణ హత్య

by Disha Web Desk 18 |
కమలాపురంలో యువకుడి దారుణ హత్య
X

దిశ,కడప: కమలాపురం పట్టణం పకీర్ వీధిలో మహమ్మద్ ఘనీ (26) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కమలాపురం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. మహమ్మద్ ఘనీ అవివాహితుడు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. ఇటీవల ఘనీ కొందరు యువకులతో ఘర్షణ పడ్డారు. మహమ్మద్ ఘనీ ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారు జామున ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. అడ్డువచ్చిన తల్లిదండ్రులను బెదిరించారు. తీవ్రంగా గాయపడిన ఘనీని కుటుంబ సభ్యులు కమలాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సమాచారం అందుకున్న కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్.ఐ హృషీకేశవరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలు కుటుంబ సభ్యుల ద్వారా సేకరించారు. డి.ఎస్పీ షరీఫ్ మాట్లాడుతూ హత్యకు సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు రెండు గ్రూపుల మధ్య మొదలైన చిన్న తగదాలే హత్యకు దారి తీసినట్లు తెలిపారు. పరస్పరం ఇరు వర్గాల వారు ద్విచక్ర వాహనం పై దాడి చేసుకోవడం వల్ల హత్య వరకు వెళ్లిందన్నారు. హత్యకు సంబంధించిన అనుమానితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. త్వరలో అగంతకులను పట్టుకుంటామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కమలాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed