ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. బాలుడి నిండు ప్రాణం బలి..

by Sumithra |
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం.. బాలుడి నిండు ప్రాణం బలి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : భీమ్ గల్ మున్సిపాలిటీ పరిధిలోని సంతోష్ నగర్ తండా శివారులో ఓ ప్యాసింజర్ ఆటో పల్టీలు కొట్టి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకెళితే భీమ్గల్ కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ సలీం తన ఆటోలో భీమ్ గల్ నుండి మోతె మార్గంలో వెళుతున్న సమయంలో కేసీఆర్ కాలనీకి వెళ్లడానికి ఐదుగురు ప్యాసింజర్ లు ఆటోలో ఎక్కారు.

డ్రైవర్ ఆటోను అతి వేగంగా నడపడంతో సంతోష్ నగర్ దాటాక రోడ్డుపై ఆటో పల్టీలు కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్యాసింజర్లు ఆటోతో పాటు రోడ్డు పై పడిపోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న సయ్యద్ రియాన్ (9)కు తలకు బలమైన గాయాలు కావడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న బేగం అనే మహిళకు గాయాలయ్యాయి. ఆటోలోని మిగతా ప్యాసింజర్లలో ఎవరికేం గాయాలు కాలేదు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమ్ గల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story