ఆటో బోల్తా...మహిళ మృతి

by Sridhar Babu |
ఆటో బోల్తా...మహిళ మృతి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ఆటో బోల్తా పడి మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బొడ్డు చంద్రవ్వ (60)తో పాటు 8 మంది ప్రయాణికులు ఆటోలో రాజన్నపేట నుంచి గొల్లపల్లికి వెళ్తున్నారు. ఆటో డ్రైవర్ రవి రాజన్నపేట గ్రామ శివారులో ఆటోను బోల్తా కొట్టించాడు. ఈ ప్రమాదంలో చంద్రవ్వ అక్కడికక్కడ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ రవి మద్యం సేవించి ఆటో నడిపాడని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed