‘ఇదే నా సంతకం నా సంకల్పం’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

by PRASAD JUKANTI |
‘ఇదే నా సంతకం నా సంకల్పం’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల వినియోగం అరికట్టే విషయంలో సీరియస్ గా ఉన్నామని ప్రకటించిన రేవంత్ రెడ్డి తాజాగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డుపై మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని రాశారు. దీనికి కొనసాగింపుగా తాజాగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో కాంగ్రెస్ పాలనలో మార్పు మొదలైందని అశాంతి నుంచి శాంతి వైపు, అసమర్థత నుంచి సమర్థత వైపు, మత్తు నుంచి చైతన్యానికి మార్పు ప్రారంభమైందన్నారు. ఈ మార్పు కోసమే నా సంతకం నా సంకల్పం అని ట్వీట్ చేశారు. డ్రగ్స్ వినియోగం ఆపాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యటనకు సంబంధించిన వీడియోనూ సీఎం ట్వీట్ పోస్టుకు జత చేశారు.

కాగా ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సమాజంలో సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతున్నదని, సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో పేద ప్రజలు, అమాయకులు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పారు. ఈ నేరాల కట్టడికి అధికారులకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధికారుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

Next Story