ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన తెలంగాణ షట్లర్ ప్రణవ్

by Harish |
ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన తెలంగాణ షట్లర్ ప్రణవ్
X

దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఏషియన్ జూనియర్ చాంపియన్‌షిప్స్ టోర్నీలో తెలంగాణకు చెందిన ప్రణవ్ రామ్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో ప్రణవ్ 21-10, 21-8 తేడాతో ఇండోనేషియా ప్లేయర్ రిజ్కి ద్వి కాహ్యొ‌పై విజయం సాధించాడు. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రణవ్ అలవోకగా రెండు గేమ్‌లను సాధించాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో తన్వి శర్మ కూడా ముందడుగు వేసింది. రెండో రౌండ్‌లో ఆమె 21-11, 21-18 తేడాతో క్సు టెంగ్ జి(చైనా)ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నవ్య రెండో రౌండ్‌లో పరాజయం పాలైంది. నీనా మత్సుత(జపాన్) 21-14, 21-6 చేతిలో ఓడిపోయి సింగిల్స్‌లో తన పోరాటాన్ని ముగించింది. అయితే, మహిళల డబుల్స్‌లో మాత్రం రేషికాతో కలిసి ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో నవ్య-రేషికా జోడీ 21-18, 21-5 తేడాతో అలిస్సా కులేషోవా-డయానా నామెనోవా(కజకస్థాన్) జంటపై విజయం సాధించింది.

Next Story

Most Viewed