ట్రాక్టర్‌ కింద పడి వ్యక్తి మృతి..

by Sumithra |
ట్రాక్టర్‌ కింద పడి వ్యక్తి మృతి..
X

దిశ, గద్వాల : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పై నుంచి కిందపడి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన గద్వాల మండలంలోని సంగాల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాల మండలం సంగాల చెరువు సమీపంలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిల్టర్ చేసిన ఇసుకను ట్రాక్టర్‌లో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు దుబ్బన్న(40) అనే వ్యక్తి ట్రాక్టర్‌ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గద్వాల రూరల్ పోలీసులు తెలిపారు.

ఫిల్టర్ ఇసుక డంప్ లను పరిశీలించిన పోలీసులు..

సంగాల గ్రామ శివారులో గల ఫిల్టర్ ఇసుక డంప్ లను గద్వాల రూరల్ పోలీసులు పరిశీలించారు. మట్టిని ట్రాక్టర్ లో లోడ్ చేసి నీటి ద్వారా మట్టిని కడిగి ఇసుక తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అక్కడ ఫిల్టర్ చేసిన ఇసుకను ట్రాక్టర్ ల ద్వారా తరలిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story

Most Viewed